గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ప్ర‌ధాని, లోక్ స‌భ స్పీక‌ర్‌, మ‌హిళా క‌మిష‌న్‌ల‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ

  • మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా గోరంట్ల‌పై ఆరోప‌ణ‌లు
  • వీడియోపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌
  • ఈ వీడియో ఎంపీల‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఉంద‌ని ఆరోప‌ణ‌
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపై గురువారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ వీడియోపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, లోక్ స‌భ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌కు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీ నేత‌, పంజాబ్‌లోని ఖ‌దూర్ సాహిబ్ పార్ల‌మెంటు స‌భ్యుడు జ‌స్బీర్ సింగ్ గిల్‌ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వ్య‌వ‌హారం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఉంద‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఈ వీడియోపై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించి బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో ప్ర‌ధాని, స్పీక‌ర్‌, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌ను కోరారు.

YSRCP
Gorantla Madhav
Prime Minister
Narendra Modi
Lok Sabha Speaker
Om Birla
National Commission For Women
NCW
Congress
Jasbir Singh Gill

More Telugu News